సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి గురువారం ఉదయం అరుణాచల్ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కెల్పై దాని తీవ్రత 5.1గా నమోదయింది. ఇటీవల కాలంలో 2వ సారి వచ్చిన ఈ ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ రోజు తెల్లవారుజాము 5.45 గంటలకు అప్పర సియాంగ్ జిల్లాలోని పాంగిన్కు 116 కిలో మీటర్ల దూరంలో.. 11 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ప్రకటించింది.
