సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రంలో పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లులు బలం లేక ఇండియా కూటమి అడ్డుకోవడంతో వీగిపోవడంతో నేడు, శనివారం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు బీజేపీ నేతలతో కలసి రోడ్లపై నడుస్తూ ర్యాలీ చేస్తూ కాంగ్రెస్ ఫై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో .. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో BJPతో పొత్తుపెట్టుకున్న రాజకీయ పార్టీల మనగడ ప్రశ్నార్థకమే.. బిహార్లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఎక్నాథ్ షిండే పరిస్థితి చూస్తూనే ఉన్నామని..ఇప్పడేదో టీడీపీ కి సీట్లు ఉన్నాయని గౌరవిస్తున్నారు. రేపు టీడీడీ, చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే అవుతుందంటూ జోస్యం చెప్పారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తనకు రాజుగా 2/ 3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా ? కేంద్రం చేసే డిక్టేటర్షిప్ని ఎవరు ఒప్పుకోరు, ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ వైసీపీ శాసన సభలో కి కేవలం 11 సీట్లే ఉన్నాయి.. అలా అని ఆంధ్రప్రదేశ్ కు నేను రాజు అని చంద్రబాబు నాయుడు చట్టం తీసుకొస్తే వాళ్ళు ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు కేంద్రం రిజర్వేషన్ కల్పించాలని సూచించారు.
