సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు నాలుగు రోజుల పాటు వరుసగా నమోదు చేసిన లాభాల పరంపరకు నిన్న మంగళవారం బ్రేక్ పడింది. దీంతో బీఎ్సఈ సెన్సెక్స్ 210.08 పాయింట్ల నష్టంతో 78,428.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 159.40 పాయింట్ల నష్టంతో 24,614.90 వద్ద ముగిసింది. అయితే నేడు, బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగినప్పటికీ మొత్తానికి స్వల్ప లాభాలతో ముగింపు జరిగింది. సెన్సెక్స్ 152 పాయింట్స్ లాభపడగా నిఫ్టీ మాత్రం కేవలం 9.75 పాయింట్స్ లాభం మాత్రమే సాధించింది.
