సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా’ సినిమాతో విభిన్న అభిరుచి ఉన్న దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీకాంత్‌ ఓదెల. తొలి చిత్రం పర్వాలేదనిపించింది. దానితో, ప్రస్తుతం నానితో ‘ప్యారడైజ్‌’ చిత్రం రూపొందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రెండో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవితో కమిట్‌ అయిన సినిమాను శ్రీకాంత్‌ ఓదెల సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు.అయితే ఈ చిత్రానికికూడా ‘నాని’ నిర్మాత. వ్యవహరించనున్నారు. అయితే తాజా ట్విస్ట్ ఏమిటంటే నాని హీరోగా నటిస్తూ మోహన్ బాబు ప్రధాన పాత్రలో ‘ప్యారడైజ్‌’ ఆగస్ట్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ‘ప్యారడైజ్‌’ కథకి చిరంజీవి చిరంజీవి చేయనున్న సినిమా కథకి ఓ లింక్‌ ఉందట. అది ప్యారడైజ్‌ క్లైమాక్స్‌లో చిరంజీవి కిపాత్రకు చెందిన ట్విస్ట్‌ రివీల్‌ అవుతతుందని తెలుస్తుంది.అయితే ఇందులో అతిధిగా చిరు నటిస్తారా? లేదా అనది సస్పెన్సు లో ఉంచారు. ప్యారడైజ్‌ చిత్రానికి ప్రీక్వెల్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే శ్రీకాంత్‌ తదుపరి సినిమా లో చిరంజీవి, నాని లు హీరోలుగా నటించనున్నారని రూడి అవుతుంది. మరి ఇందులో మోహన్ బాబు కూడా కంటిన్యూ అయితే భలే క్రేజీ కాంబినేషన్ అవుతుంది మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *