సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో నేటి ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొందరు వ్యక్తులు నదిలో చిన్న పడవలో సరదాగా విహారయాత్రకు వెళ్లగా,వారి తిరుగు ప్రయాణంలో పడవ అకస్మాతుగా బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం పదిమంది నీటిలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి ఆరుగురిని సురక్షితంగా కాపాడారు.. అయితే మరో నలుగురు గల్లంతయ్యారు. అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
