సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత రాజ్యాంగ రూపకర్త, భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా నేటి మంగళవారం ఉదయం కాళ్ళ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదులు, రాజనీతిజ్ఞులు, అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన సంఘసంస్కర్త, భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను. జై భీమ్! అని నినదించారు.
