సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శ్రావణ శుక్రవారం అంటేనే మహిళలందరికీ ముఖ్యమైన పండుగ .. ఈ పండుగ రోజున మహిళలకు బంగారం ధరల షాక్ తగిలింది. బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతుండటంతో మార్కెట్లపై దీని ప్రభావం పడింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో విజయవాడ హైదరాబాద్ మార్కెట్ లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,990గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,658 వద్ద కొనసాగుతోంది. ఇదే బాటలలో వెండి కూడా విజయవాడ .హైదరాబాద్ మార్కెట్ లలో కిలో వెండి ధర రూ.2,45,610 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కేజీ సిల్వర్ రూ.2,45,940గా ఉండగా.. బెంగళూరులో రూ.2,45,420 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.2,44,560 వద్ద కొనసాగుతోంది.
